టాక్..”తునివు”, “వరిసు” రిలీజ్ పై ఊహించని బజ్.!

టాక్..”తునివు”, “వరిసు” రిలీజ్ పై ఊహించని బజ్.!

Published on Nov 20, 2022 8:37 PM IST

తమిళ సినిమా దగ్గర చాలా కాలం తర్వాత ఓ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ ఇప్పుడు జరగడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో భారీ స్టార్డం ఉన్న స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు దళపతి విజయ్ ల లేటెస్ట్ చిత్రాలు “వరిసు” మరియు “తునివు” చిత్రాలు రిలీజ్ కి వచ్చే ఏడాది సంక్రాంతిలో రెడీగా ఉండగా ఇంకా ఏ చిత్రం అయితే ముందు వస్తుంది అనేది ఇంకా అనౌన్స్ కాలేదు.

ఇక ఈ ఎపిక్ బిగ్గెస్ట్ క్లాష్ కోసం అభిమానులు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ పై ఊహించని బజ్ ఒకటి బయటకి వచ్చింది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ లో కాకుండా రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని క్రేజీ టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది. దీనితో ఈ రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ అయితే ఆ రోజు తమిళ నాట పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించని లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఈ భారీ క్లాష్ పై అధికారికంగా క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు