రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ భారీ సొరంగం ఫైట్ ను ప్లాన్ చేశాడు జక్కన్న. ఈ సొరంగం లో విష సర్పాలతో పాటు వింత మృగాలు మరియు మనుషుల పచ్చి మాంసం తినే అడవి మనుషుల తో మహేష్ చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ విజువల్స్ తో ఉంటుందట. సినిమా మొత్తంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ మహేశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటలను బట్టి ఈ చిత్రం ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది.