“వీరసింహా రెడ్డి” ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్.?

“వీరసింహా రెడ్డి” ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్.?

Published on Nov 19, 2022 8:00 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ లో మాస్ ఆడియెన్స్ కి క్రేజీ రెడీగా ఉన్న అప్ కమింగ్ మాస్ చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వీరసింహా రెడ్డి” కూడా ఒకటి. ఇక ఈ చిత్రం ఇప్పుడు అనంతపూర్ చుట్టుపక్కల షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటుండగా ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ పై అయితే సంగీత దర్శకుడు థమన్ క్రేజీ హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

“జై బాలయ్య, త్వరలో తొడ గొట్టి దుమ్ము లేపే టైం వచ్చిందిరో..” అంటూ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసాడు. దీనితో అయితే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ గా జై బాలయ్య అంటూ సాంగ్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారని అర్ధం అవుతుంది. దీనితో అయితే బాలయ్య ఫ్యాన్స్ కూడా మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు