తన మంచి మనసు చాటుకున్న నిర్మాత సురేష్ బాబు

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇప్పటివరకు అనేక సినిమాలు నిర్మించి మంచి పేరు గడించారు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు. ఇక గత కొన్నేళ్లకుగా ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు ప్రస్తుతం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తమ బ్యానర్ పై పలు సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తూ మంచి పేరుతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వెంకటేష్, ప్రియమణి కలయికలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన నిర్మించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో రిలీజ్ అయి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక అసలు సంగతి ఏమిటంటే, డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీని థియేటర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీ యొక్క థియేటర్స్ ప్రదర్శన సందర్భంగా రానున్న కలెక్షన్ లో సురేష్ బాబు ఒక్కరూపాయి కూడా వాటా తీసుకోవడం లేదట, అలానే అది మొత్తం చారిటీకి వెళ్తుందని ప్రకటించారు. ఎంతో మంచి మనసుతో సురేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Exit mobile version