దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్…తెలుగు చిత్రాలకు నాలుగు అవార్డులు!

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్…తెలుగు చిత్రాలకు నాలుగు అవార్డులు!

Published on Oct 25, 2021 2:44 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అవసరం లేని పేరు అని చెప్పాలి. కేవలం భారత్ లో మాత్రమే కాకుండా, విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు రజినీ కాంత్. గత 40 ఏళ్లుగా సినీ పరిశ్రమ కి రజినీకాంత్ చేస్తున్న సేవ కి కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ కి చెందిన అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నేడు రజినీకాంత్ కి ఇవ్వడం జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును అందజేయడం జరిగింది. అదే విధంగా జాతీయ సినిమా అవార్డు లలో ప్రముఖ నటుడు గా ధనుష్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. అసురన్ చిత్రం లో తన నటన ప్రతిభతో ఈ అవార్డును అందుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓకే రోజు ధనుష్ కు మరియు రజనీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా తెలుగు లో జెర్సీ మరియు మహర్షి చిత్రాలకు మొత్తం నాలుగు అవార్డులు లభించాయి. ఉత్తమ తెలుగు చిత్రం గా జెర్సీ అవార్డ్ ను అందుకాగా, ఉత్తమ ఎడిటింగ్ నవీన్ నూలి కి జెర్సీ చిత్రానికి రావడం జరిగింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి చిత్రం కి అవార్డ్ రాగా, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం కి మహర్షి చిత్రానికి రావడం జరిగింది. ఈ అవార్డ్ లలో ఉత్తమ నటి గా కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రానికి అవార్డ్ అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు