‘మిషన్ 2020’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ‘దర్జా’ మూవీ టీమ్..!

‘మిషన్ 2020’ టీమ్‌కు అభినందనలు తెలిపిన ‘దర్జా’ మూవీ టీమ్..!

Published on Oct 30, 2021 10:00 AM IST

నవీన్ చంద్ర హీరోగా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ 2020’. గతంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ పోలీస్’, ‘ఆపరేషన్ 2019’ సినిమాలను తెరకెక్కించిన కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకుడు. హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ‘దర్జా’ మూవీ టీమ్ పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపింది. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ‘దర్జా’ మూవీ టీమ్ శుక్రవారం ‘మిషన్ 2020’ చిత్రాన్ని చూశారు. సినిమా నచ్చడంతో వెంటనే ‘మిషన్ 2020’ టీమ్‌ని శాలువాలతో సత్కరించి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా ‘దర్జా’ మూవీ ప్రొడ్యూసర్ శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి మాట్లాడుతూ “మిషన్ 2020” చిత్రాన్ని చూశాము. చాలా బాగా నచ్చిందని, యూత్ అంతా తప్పని సరిగా చూడాల్సిన చిత్రమిదని అన్నారు. మెసేజ్ అనే కాదు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని, ఈ చిత్రాన్ని దర్శకుడు కరణం బాబ్జి చాలా చక్కగా తెరకెక్కించారని అన్నారు. ఇక ఇలాంటి స్టోరీ వినగానే మాములుగా అయితే నిర్మాతలు ఇలాంటి సినిమా తీయవచ్చా? లేదా? అని ఆలోచిస్తారని, కానీ అలాంటిదేమీ పట్టించుకోకుండా ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్ అని అన్నారు. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ ఇచ్చిన ఆర్ఆర్ మాములుగా లేదు. ఆయనే మా ‘దర్జా’ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లలో చూడాలని, 8వ తరగతి, ఆ పైన చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ తప్పక ఈ చిత్రాన్ని చూడండి. మరొక్కసారి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నామని అన్నారు.

సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని, ఇది ప్రేక్షకులు ఇచ్చిన విజయమని, మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకే థియేటర్స్ పెరిగాయి. సినిమా సక్సెస్ గురించి చెప్పడానికి ఇది చాలని, మార్నింగ్ నుండి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నా లైఫ్‌లో ఇన్ని కాల్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. మా సినిమా చూసి ‘దర్జా’ మూవీ టీమ్ ఇంత గొప్పగా సత్కరించి, అభినందించినందుకు వారికి ధన్యవాదాలు. మేము ఎలాంటి సక్సెస్‌ని అయితే ఊహించామో అలాంటి సక్సెస్‌ని ప్రేక్షకులు ఇచ్చారు. ఇంత స్ట్రాంగ్ పాయింట్‌ని ఇన్ డైరెక్ట్‌గా కాకుండా డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం దర్శకుడు కరణం బాబ్జి గారికే ఉందని, ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని అన్నారు. పేరేంట్స్ కొన్ని విషయాలను పిల్లలకు డైరెక్ట్‌గా చెప్పలేరు. ఇలాంటి సినిమాలు చూపించడం ద్వారా అలాంటి విషయాలు చెప్పిన వారవుతారు. ఈ సినిమాని మీ పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని చూపించండి. పిల్లలకు, పేరేంట్స్‌కు ఈ సినిమా అవసరం. ఈ సినిమాకు సెన్సార్ వారు ఇచ్చిన సపోర్ట్‌ని మరిచిపోలేమని, వారందరికీ మా టీమ్ తరపున ధన్యవాదాలు. అలాగే ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించిన మా నిర్మాతల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక మంచి మెసేజ్‌ని సమాజానికి ఇచ్చే కార్యక్రమంలో వారందించిన సపోర్ట్‌కి హ్యాట్సాఫ్ అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ టీమ్‌తో మరిన్ని మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు