టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తాజాగా తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే శ్రీవారికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణం ను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి అందించడం జరిగింది. అయితే పలు చిత్రాలతో పేరొందిన దాసరి కిరణ్ కుమార్, జీనియస్, వస్తా నీ వెనుక, రామ్ లీలా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే భవిష్యత్ లో సైతం మరిన్ని తెలుగు చిత్రాలను నిర్మించే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.
