లేటెస్ట్..”వరిసు” ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

లేటెస్ట్..”వరిసు” ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

Published on Nov 3, 2022 10:50 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ “వరిసు”. మరి తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు గా తెరకెక్కిస్తుండగా రెండు భాషల్లో కూడా ఈ చిత్రానికి భారీ హైప్ సెట్టయ్యింది. ఇక ఆల్రెడీ అయితే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా ఈ చిత్రం జరుపుకోగా సినిమాలో ఫస్ట్ సింగిల్ పై అయితే గత కొన్ని రోజులు నుంచి మంచి సస్పెన్స్ నడుస్తుంది.

ఇక ఫైనల్ గా అయితే ఈ ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ నుంచి సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రోమో నే ఏకంగా ఈరోజు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి అయితే ఈ ప్రోమో రానుందని ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రం థమన్ ఇచ్చిన ఆ క్రేజీ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు