ప్రభాస్, బాలయ్య..మరో హీరో ఫేస్ టు ఫేస్ ఆరోజే..!

ప్రభాస్, బాలయ్య..మరో హీరో ఫేస్ టు ఫేస్ ఆరోజే..!

Published on Dec 8, 2022 8:00 AM IST

మన టాలీవుడ్ అగ్ర తారలు అయినటువంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు బాలకృష్ణలు ప్రస్తుతం తమ తమ భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య సినిమాలతో పాటుగా బాలయ్య ప్రముఖ ఓటిటి యాప్ “ఆహా” లో అన్ స్టాప్పబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఇది రెండో సీజన్లోకి ఇప్పుడు అడుగు పెట్టగా అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తో అయితే ఈసారి సీజన్ నడుస్తుంది. ఇక ఈ సీజన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కనిపిస్తాడని ఆమధ్య రూమర్స్ వచ్చాయి. మరి ఇది ఇప్పుడు కన్ఫర్మ్ కాగా ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ ఎప్పుడు అనేది తెలుస్తుంది.

ఈ షూట్ ఈ డిసెంబర్ 11న అయితే జరగనుందట. మరి దీనితో అయితే ఆరోజు బాలయ్య మరియు ప్రభాస్ లు ఫేస్ టు ఫేస్ అవ్వనున్నారని చెప్పాలి. అలాగే ఇదే ఎపిసోడ్ లో అయితే మన టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కూడా కనిపించనున్నాడని రూమర్స్ ఉన్నాయి. మరి దీనిపై కూడా మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు