టాక్..”వారిసు” గ్రాండ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్.?

టాక్..”వారిసు” గ్రాండ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్.?

Published on Dec 9, 2022 7:02 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వారిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని తెలుగులో “వారసుడు” పేరిట రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ కాగా ఈ చిత్రం గ్రాండ్ ఆడియో ఫంక్షన్ ని అయితే మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి మొదట తమిళ్ లోనే ప్లాన్ చెయ్యగా అక్కడ నెవర్ బిఫోర్ లెవెల్లో ఈ డిసెంబర్ 24న చేయనున్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా తాను ఇచ్చిన రెండు పాటలు ఆల్రెడీ భారీ హిట్స్ అయ్యాయి. అలాగే ఈ చిత్రం అయితే వచ్చే ఏడాది జనవరి 12 రిలీజ్ కి ప్లానింగ్ లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు