కమల్- మణిరత్నం సినిమా పై క్రేజీ అప్ డేట్ ?

కమల్- మణిరత్నం సినిమా పై క్రేజీ అప్ డేట్ ?

Published on Jan 30, 2023 7:03 AM IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “విక్రమ్”. ఇదే ఉత్సాహంతో కమల్ లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ చాన్నేళ్లకి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కమల్ కెరీర్ లో 234వ చిత్రంగా రాబోతుంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె ఓ కీలక పాత్రలో నటిస్తోందట. అయితే ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని,
జస్ట్ గెస్ట్ రోల్ అని టాక్ నడుస్తోంది. ఐతే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్ మూవీ అని, తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారసులు ఎలా ఉండాలి ? అనే అంశంతో ఈ సినిమా సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇది వరకే “చీకటి రాజ్యం” అనే చిత్రం ఈ కాంబినేషన్ లో వచ్చింది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. పొన్నియన్ సెల్వన్- 2 పూర్తయ్యాక మణిరత్నం ఈ సినిమా షూట్ మొదలెడతాడని టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు