పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ధనుష్ – శేఖర్ కమ్ముల చిత్రం!

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ధనుష్ – శేఖర్ కమ్ముల చిత్రం!

Published on Nov 28, 2022 2:00 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ఏ పాత్రలోనైనా సునాయాసం గా చేయగలడు. అతని బహుముఖ ప్రజ్ఞ మరియు నటనా నైపుణ్యం కారణంగా దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు గా ఉన్నారు. కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, పాత్ బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడం లో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టనున్నారు.

ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కి, విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్) లపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ చిత్రం కోసం వివిధ భాషలకు చెందిన నటీనటులను, అగ్రశ్రేణి సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు