ధనుష్ తో ప్రభాస్ డైరెక్టర్ ప్లానింగ్?

ధనుష్ తో ప్రభాస్ డైరెక్టర్ ప్లానింగ్?

Published on Dec 18, 2022 11:49 PM IST

రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తమిళ హీరో ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ధనుష్ కి రాధాకృష్ణ కుమార్ ఓ కథ చెప్పాడని, ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, ధనుష్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను – ధనుష్ ను కలిపింది యూవీ క్రియేషన్స్ అని టాక్ నడుస్తోంది. మరి ధనుష్ ఇమేజ్ కోసం రాధాకృష్ణ కుమార్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. నిజానికి శ్రీకాంత్ అడ్డాల ధనుష్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా రాధాకృష్ణ కుమార్ పేరు వినిపిస్తోంది. ధనుష్ అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని రాధాకృష్ణ కుమార్ ఫీల్ అయ్యాడు. ధనుష్ తన కొత్త ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు