విజయ్ vs అజిత్ ఇష్యూ పై దిల్ రాజు క్లారిటీ

విజయ్ vs అజిత్ ఇష్యూ పై దిల్ రాజు క్లారిటీ

Published on Dec 28, 2022 7:07 PM IST

కోలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా భారీ స్థాయి ప్రేక్షకాభిమానుల యొక్క క్రేజ్ తో దూసుకెళ్తున్న హీరోలు తలా అజిత్ కుమార్, ఇలయలదళపతి విజయ్. ఇక వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వారి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది. అయితే రాబోయే 2023 సంక్రాంతి బరిలో వీరిద్దరి లేటెస్ట్ మూవీస్ అయిన తునీవు, వరిసు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండడంతో వాటిలో ఏది ఏస్థాయి విజయం అందుకుంటుంది అనే దానిపై వారి వారి అభిమానులు మరియు ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొంది.

ఇక విజయ్ నటిస్తున్న వరిసు మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఆ మూవీని నిర్మిస్తున్నారు. అజిత్ నటిస్తున్న తునీవు మూవీ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఈ రెండు సినిమాల థియేటర్స్ విషయమై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, కోలీవుడ్ లో అజిత్ కంటే విజయ్ పెద్ద స్థాయి నటుడని, అలానే వరిసు కి మరిన్ని ఎక్కువ థియేటర్స్ కేటాయించాల్సిందిగా తునీవు డిస్ట్రిబ్యూటర్స్ అయిన రెడ్ జెయింట్ కంపెనీ వారిని కోరుతున్నానని కామెంట్ చేయడం జరిగింది. దానితో ఒక్కసారిగా ఆ ఇష్యూ ఒకింత వైరల్ గా మారి పలువురు అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు పై నెగటివ్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కాగా నేడు ఒక మీడియా ఛానెల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ విషయమై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ, గతంలో తాను మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడ అజిత్ ని తక్కువ చేయాలనేది తన ఉద్దేశ్యం కాదన్నారు దిల్ రాజు. అయితే ఒక హీరో యొక్క స్టార్ పవర్ తెలియాలి అంటే హిట్ లేదా ఫ్లాప్ అనే రిజల్ట్ తో సంబంధం లేకుండా అతని గత 5,6 సినిమాల రెవిన్యూస్ చూస్తే తెలుస్తుందని, గతంలో వచ్చిన విజయ్ 5 సినిమాలు తమిళనాడులో రూ. 60 కోట్ల మేర షేర్ అందుకున్నాయని అన్నారు. అలానే అజిత్ కి కూడా మంచి బాక్సాఫీస్ ట్రాక్ రికార్డు ఉందని, అయితే మొత్తంగా చూసుకుంటే విజయ్ సినిమాల రెవిన్యూ ఒకింత పై స్థాయిలో ఉండడంతోనే తమ వరిసు మూవీకి ఎక్కువ థియేటర్స్ కోరినట్లు ఆయన తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు