“క్రేజీ అంకుల్స్” టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!

“క్రేజీ అంకుల్స్” టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!

Published on Jul 25, 2021 7:37 PM IST

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. అయితే ఈ కామెడీ రైడ్ ఆగస్ట్‌లో థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ క్రేజీ అంకుల్ టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి విడుద‌ల‌ చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు శ్రీ‌ధ‌ర్ రావు, ల‌క్ష్మ‌ణ‌రావు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఈ కార్యక్రమం లో యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ, క్రేజీ అంకుల్స్‌ సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్‌ వస్తుంది అని, థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది అని అన్నారు. ఈ సినిమాలో చాలా మంది
ఫేమస్‌ యాక్టర్స్‌ నటించారు అని, క్రేజీ కాంబినేషన్లు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటీనటులందరు నా కెరీర్‌లో నాకు ఎక్కడో ఒక చోట పరిచయం ఉన్నవారే అని, మా అందరితో చాలా ఓపిగ్గా వర్క్‌ చేయించుకున్న దర్శకులు సత్తిబాబు గారికి, నిర్మాత అశోక్‌ గారికి ధన్యవాదాలు తెలిపారు. శ్రేయాస్‌ శ్రీనివాస్‌గారు భవిష్యత్‌లో ఇలాంటి ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌తో పాటుగా, పెద్ద పెద్ద సినిమాలను కూడా నిర్మించాలి అని అన్నారు.

నటుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా సెట్స్‌లోనే నేను, మను, భరణి చాలా బాగా ఏంజాయ్‌ చేశాం అని అన్నారు. చిత్రబృందంలోని ప్రతిఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు, ఇక నేను డ్యాన్స్‌ చేసి చాలా కాలం అయ్యింది అని అన్నారు. నా వయసు 54 సంవత్సరాలు, ఈ క్రేజీ అంకుల్స్‌ సాంగ్లో నటించడం హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చారు.
నా కెరీర్‌ బిగినింగ్‌లో రఘుకుంచెగారు నాకు డబ్బింగ్‌ చెప్పారు. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీ అయిపోయిన తర్వాత నేను చెప్పుకున్నాను అని అన్నారు. శ్రీముఖి భవిష్యత్‌లో పెద్ద ఆర్టిస్టు కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పెద్ద పెద్ద సినిమాలు కూడా థియేటర్స్‌లో విడుదల అవుతున్న ఈ సమయంలో క్రేజీ అంకుల్స్‌ సినిమాను థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా నిర్మాతలకు
దన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ, నాకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం, కొంతమంది పెద్ద హీరోలతో కామెడీ సినిమాలు చేయలేం, అందుకనే ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోక్రేజీ అంకుల్స్‌ అనుకున్నాం అని అన్నారు. డార్లింగ్‌ సామీ కథతో ఈ సినిమా మొదలైంది అని, క్రేజీ అంకుల్సే కాదు, భవిష్యత్‌లో ఇంకా ఎంటర్‌టైనింగ్‌ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తామని అన్నారు. త్వరలో గోల్డ్‌మ్యాన్‌ వస్తుంది, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె చాలా స్పీడ్‌గా వర్క్‌ చేశారు, టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ సినిమాకు పాండమిక్‌ టైమ్‌లో కూడా వర్క్‌ చేశాం అని చెప్పుకొచ్చారు. క్రేజీ అంకుల్స్‌ కోసం ఫిఫ్టీ ఇయర్స్‌ వారిపై ఓ సాంగ్‌ను తీశాం, ఈ సాంగ్‌కు సత్య మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌, మనోగారి స్పాంటేనిటీ అందరికి తెలిసిందే అంటూ చెప్పుకొచ్చారు. రాజా రవీంద్ర, భరణి కూడా బాగా చేశారు. ముగ్గురు అంకుల్స్, ముగ్గురు ఆంటీలు చేసిన కథే ఈ సినిమా అంటూ చెప్పుకొచ్చారు. సినిమాలో ఎక్కడా వల్గారిటీ ఉండదు అని, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది అని, శ్రీముఖిలో ఉన్న స్పెషల్‌ ఎనర్జీ నాకు చాలా ఇష్టం అని, భవిష్యత్‌లో తను మంచి నటిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. మేం కోరుకున్నట్లుగా అవుట్‌పుట్‌ ఇచ్చిన సత్తిబాబుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, రియల్‌లైఫ్‌ క్యారెక్టర్స్‌ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి అని అన్నారు. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వుతూనే ఉంటారు అని, రాజారవీంద్ర, మను ,భరణి బాగా చేశారు అని అన్నారు. ఈ సినిమా విజయం సాధించి, చిత్రర యూనిట్‌ లోని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి అని అన్నారు. దగ్గరగా దూరంగా సినిమా తర్వాత నేను, కాసర్ల శ్యామ్‌ క్రేజీ అంకుల్స్‌ సినిమాకు కలిసి పని చేశాం అని అన్నారు.

చిత్ర నిర్మాత బొడ్డు అశోక్‌ మాట్లాడుతూ, నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన శ్రేయాస్‌ శ్రీనివాస్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. దర్శకులు శ్రీవాస్‌ నాకు మంచి మిత్రులు అని, క్రేజీ అంకుల్స్‌ చిత్రం ప్రేక్షకులను తప్పకుండ ఎంటర్‌టైన్‌ చేస్తుంది అని, ఈ సినిమా వినోదభరితంగా ఉంటూనే సందేశాత్మకంగా ఉంటుంది అని, ఈ సినిమా చివర్లో ఉన్న ట్విస్ట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది అని, అలాగే మా నుంచి మరో మూవీ గోల్డ్‌మాన్‌ రానుంది అని, ఈ చిత్రం కూడా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

గీత రచయిత కాసర్లశ్యామ్‌ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్‌ క్రేజీగానే మొదలైంది అని, శ్రేయాస్శ్రీనివాస్, రఘుకుంచె గార్లతో నాకు మంచి అనుబంధం ఉంది అని అన్నారు. రాజా రవీంద్రగారు నా కెరీర్‌ మొదట్నుంచే నన్ను ప్రొత్సహిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. క్రేజీ అంకుల్స్‌ లో తాజాగా విడుదలైన ఈ పాటను లిస్పిక బాగా పాడారు,
ఆమెకు అభినందనలు, రఘుకుంచెగారు ఓకల్స్‌ ఇచ్చారు అని అన్నారు.

రచయిత డార్లింగ్‌ సామీ మాట్లాడుతూ, క్రేజీఅంకుల్స్‌ సినిమా అవుట్‌ పుట్‌ బాగా వచ్చింది అని. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాలి అని అన్నారు.

గాయ‌త్రి భార్గ‌వి మాట్లాడుతూ, అందరం కష్టపడి ఓ మంచి సినిమా చేశాం, ప్రేక్షకులు ఓ మంచి ఎంటర్‌టైనర్‌ మూవీని చూడబోతున్నారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మాత శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నేను ఎప్పుడు మైక్‌లో మాట్లాడింది లేదు, కానీ ఇప్పుడు మా నిర్మాత బొడ్డు అశోక్‌గారి గురించి చెప్పాలనుకుని మైక్‌ పట్టుకున్నాను అని అన్నారు. ఆయన నాకు చాలా హెల్ప్‌ చేస్తున్నారు, చాలా బాగా ప్రొత్సహిస్తున్నారు, అశోక్‌గారు నాకు ఇచ్చిన ధైర్యం నాలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది అంటూ చెప్పుకొచ్చారు. వారే మా బలం, హెల్దీ కామెడీ సినిమాలు చేద్దామని క్రేజీ అంకుల్స్‌ స్టార్ట్‌ చేశామని అన్నారు. ప్రాజెక్ట్‌ 2020 దసరాకు ప్రారంభమైందని, 2021 జనవరిలో పూర్తయిందని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కే రిలీజ్‌ చేద్దాం అనుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. కాకపోతే పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో క్రేజీ అంకుల్స్‌ రిలీజ్‌ను వాయిదా వేశాం అని అన్నారు. ఆ తర్వాత మేలో విడుదల చేద్దాం అనుకున్నాం అని, కరోనా వచ్చింది అని తెలిపారు. ఇప్పుడు క్రేజీ అంకుల్స్‌ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు. మా మరో మూవీ గోల్డ్‌మ్యాన్‌ను ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం అని, కేవలం నాకు సాయపడాలనే ఉద్దేశంతో బిజీ ఆర్టిస్టులు, ప్రముఖ నటులు తమ పారితోషికాలను తగ్గించుకున్నారు అని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు ఈ రోజుల్లో, రొమాన్స్‌ ఇలా 8 సినిమాలు చేశాను అని అన్నారు. భవిష్యత్‌లో మరోస్థాయి పెద్ద సినిమాలను తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు