సూపర్ స్టార్ యాటిట్యూడ్ తో మైండ్ బ్లాక్ అయింది – గోపీచంద్ మలినేని


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తుండగా, చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ట్రైలర్ మాస్ అంటూ డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు యాటిట్యూడ్ తో మైండ్ బ్లాక్ అయింది అని అన్నారు. ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించిన డైరెక్టర్, చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Exit mobile version