‘వీరసింహారెడ్డి’ ‘జై బాలయ్య’ సాంగ్ పై హైప్ పెంచేస్తున్న డైరెక్టర్

‘వీరసింహారెడ్డి’ ‘జై బాలయ్య’ సాంగ్ పై హైప్ పెంచేస్తున్న డైరెక్టర్

Published on Nov 25, 2022 1:00 AM IST


నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్ణిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి జై బాలయ్య అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రేపు ఉదయం 10 గం. 29 ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది యూనిట్.

హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా సాగె ఈ సాంగ్ కి థమన్ సూపర్ ట్యూన్ అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ పై బాలకృష్ణ ఫ్యాన్స్ లో మరింత హైప్ పెంచారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సాంగ్ లో నిన్ను తాకే దమ్మున్నోడు లేనేలేడయ్యా అనే లిరిక్స్ అదిరిపోయాయి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా దీనిని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు