శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రుద్రమాంబపురం. మూలవాసుల కథ అనేది ట్యాగ్లైన్. ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నందూరి రాము ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బంటు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు శుభోదయం సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదలచేసి టైటిల్ చాలా బాగుందని ప్రశంసించి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ చిత్రంలో పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు నటిస్తున్నారు. వెంగీ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. వెంకటేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.