మా ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్ – దర్శకుడు రామకృష్ణ

మా ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థాంక్స్ – దర్శకుడు రామకృష్ణ

Published on Aug 1, 2021 9:00 AM IST

నూతన దర్శకుడు రామకృష్ణ తోట దర్శకత్వంలో సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్’ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు కొన్ని ఏరియాల్లో బాగానే రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం చెబుతుంది.

ఈ సందర్భంగా హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘మా సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’ కు బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తప్పకుండా ఆదరణ ఉంటుందని ఈ సినిమాతో ఆడియన్స్ మరోసారి నిరూపించారు. నా క్యారెక్టర్ కు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు’ అని తెలిపారు.

దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ.. ‘మేము ఎలాంటి రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేశామో.. ప్రేక్షకులు మా ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాకు అలాంటి రిజల్ట్ నే అందించారు. థియేటర్ దగ్గర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. జెన్యూన్ టాక్ తో మా సినిమా ప్రదర్శితం అవుతోంది. ప్రతి షోకు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉంది. కాబట్టి మా సినిమాకు మరింత ఆదరణ దక్కుతోంది భావిస్తున్నాము. మా సినిమాని ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు