“జైత్ర” సినిమా ఒక రైతు కథతో, మంచి స్లాంగ్ తో రాబోతోంది – డైరెక్టర్ వేణు ఉడుగుల

“జైత్ర” సినిమా ఒక రైతు కథతో, మంచి స్లాంగ్ తో రాబోతోంది – డైరెక్టర్ వేణు ఉడుగుల

Published on Sep 25, 2022 11:14 AM IST

అల్లం శ్రీ తన్మయి సమర్పణ లో ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌ నిర్మిస్తున్న చిత్రం జైత్ర‌. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరో హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కుని గా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత‌. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ లభించింది. రాయలసీమ స్లాంగ్ , నేటివిటీ తో తెరకెక్కిన ఈ సినిమా మట్టి తో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది. తాజాగా ఈ సినిమా నుండి మూడో లిరికల్ సాంగ్ సందమామయ్యాలో ను దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు.

ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ, “జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్ టీజర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు. సందమామయ్యా లో సాంగ్ చాలా బాగుంది, ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శకుడు మల్లికార్జున్ తోట, నిర్మాత అల్లం సుభాష్ కు జైత్ర సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న” అని అన్నారు.

సన్నీ, నవీన్, రోహిణి రాచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మోహ‌న్ చారి, పాట‌లు కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, సంగీతం ఫ‌ణి క‌ళ్యాన్‌, ఎడిటర్ విప్లవ్ నైషదం, ద‌ర్శ‌క‌త్వం తోట మ‌ల్లిఖార్జున్, నిర్మాత‌ అల్లం సుభాష్‌ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు