డయానా ఆశలన్నీ నవాబ్ పైనే !

ప్రముఖ దర్శకుడు మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి , విజయ్ సేతుపతి , శింబు , అరుణ్ విజయ్ లు హీరోలుగా నటిస్తుండగా అదితి రావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్ , డయానాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈచిత్రం తో హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా నవాబ్ తో హిట్ కొట్టి తెలుగులో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తానంటుంది. ఆమె ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఈచిత్రం విడుదల తరువాత వరుస ఆఫర్లతో ఆమె తెలుగు లో బిజీ కావలని భావిస్తోందట. ఇక ఈచిత్రంలో లుక్స్ పరంగానే కాకుండా నటనతో మెప్పిస్తా అంటుంది ఈ హీరోయిన్.

ఈచిత్రంలో నటిస్తున్న 4గురు హీరోలు అన్నదమ్ములుగా కనిపించనున్నారట . వీరి మధ్య వచ్చే గొడవల తాలూకు సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయి. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలకానుంది ఈచిత్రం.

Exit mobile version