అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.64 కోట్ల వసూళ్ళను అందుకున్న ఈ సినిమా బన్నీ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. నిర్మాణ సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం ముందుగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి మూడు రోజుల్లోనే రూ.34.72 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ.41 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ షేర్ రూ. 45కోట్లుగా ఉంది. అలాగే నార్త్ అమెరికాలో కూడా వసూళ్ళు మిలియన్ డాలర్ మార్కుకు దగ్గరయాయ్యి.
ఇక ఏపి, తెలంగాణాల్లో ఏరియాల వారీగా చూసుకుంటే..
ఏరియా | వసూళ్లు |
నైజాం | 11.57 కోట్లు |
సీడెడ్ | 5.50 కోట్లు |
నెల్లూరు | 1.59 కోట్లు |
గుంటూరు | 3.55 కోట్లు |
కృష్ణ | 2.32 కోట్లు |
ఈస్ట్ గోదావారి | 3.03 కోట్లు |
వెస్ట్ గోదావారి | 2.81 కోట్లు |
ఉత్తరాంధ్ర | 4.33 కోట్లు |
మొత్తం |
34.72 కోట్లు |