‘సరైనోడు’ చిత్రంతో గతేడాది మంచి విజయాన్ని అందుకుని తన మార్కెట్ స్థాయిని అమాంతం పెంచుకున్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం కూడా ‘దువ్వాడ జగన్నాథమ్’ తో అలాంటి ప్రయత్నమే చేశారు. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీతో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఏపి. తెలంగాణాలో దాదాపు రూ.18 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ వసూళ్లే ఇప్పటి దాకా బన్నీ కెరీర్లో ఉత్తమమైనవిగా నమోదయ్యాయి.
ఇక ఏరియాల వారీగా ఈ లెక్కల్ని చూసుకుంటే..
ఏరియా | వసూళ్లు |
నైజాం | 4.90 కోట్లు |
సీడెడ్ | 2.70 కోట్లు |
ఉత్తరాంధ్ర | 1.94 కోట్లు |
గుంటూరు | 2.26 కోట్లు |
కృష్ణ | 1.03 కోట్లు |
ఈస్ట్ గోదావారి | 1.86 కోట్లు |
వెస్ట్ గోదావారి | 2.08 కోట్లు |
నెల్లూరు | 1.10 కోట్లు |
మొత్తం | 17. 87 కోట్లు |