బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోన్న “దృశ్యం2”

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోన్న “దృశ్యం2”

Published on Nov 27, 2022 5:36 PM IST

బాలీవుడ్ చిత్రం దృశ్యం 2 థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వరుణ్ ధావన్ భేదియా చిత్రం కి అజయ్ దేవగణ్ నటించిన ఈ దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తోంది. భేదియా మొదటి రోజు కలెక్షన్లు అజయ్ సినిమా రెండవ శుక్రవారం కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయి. దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద ఆధిపత్య స్థాయి అలాంటిది. ఈ చిత్రానికి రెండో శనివారం అయిన నిన్న బాక్సాఫీస్ వద్ద మరో అద్భుతమైన రోజు. ఈ చిత్రం రెండవ శుక్రవారం నాడు అపూర్వమైన 78 శాతం వృద్ధిని కనబరిచింది.

PR ప్రకారం నిన్న 14.05 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ 126 కోట్లు కాగా, ఈరోజు ఈ సినిమా మరో 20 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. స్టార్ హీరోకి సరైన కంటెంట్ ఉంటే, బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలాగే ఉంటాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో 200 కోట్ల మార్క్‌ను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. శ్రియా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ మరియు రజత్ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు, ఇది సినిమా యొక్క భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు