సెన్సార్ పూర్తి చేసుకున్న దృశ్యం2…రన్ టైమ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న దృశ్యం2…రన్ టైమ్ ఎంతంటే?

Published on Nov 13, 2022 4:47 PM IST


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు శ్రియా శరణ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 2 నవంబర్ 18, 2022 న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అభిషేక్ పాఠక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ని పొందింది. అలాగే సినిమా రన్ టైం దాదాపు 2 గంటల 22 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సిరీస్, పనోరమా స్టూడియోస్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు