బాక్సాఫీస్ వద్ద ఆగని “దృశ్యం2” వసూళ్లు!

బాక్సాఫీస్ వద్ద ఆగని “దృశ్యం2” వసూళ్లు!

Published on Dec 24, 2022 12:00 AM IST


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యం2. మలయాళం లో సూపర్ హిట్ అయిన దృశ్యం2 కి ఇది అధికారిక రీమేక్. ఈ చిత్రం విడుదల అయ్యి వారాలు గడుస్తున్నా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 225 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది.

బాలీవుడ్ లో ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం, కంటెంట్ బేస్డ్ మూవీ గా ప్రశంసలు అందుకోవడం పట్ల టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. ఈ చిత్రం లో టబు, శ్రియ శరణ్, అక్షయ్ ఖన్నా, ఇశిత దత్తా లు కీలక పాత్రల్లో నటించారు.అభిషేక్ పతక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు