‘వీరసింహారెడ్డి’ విలన్‌ను పట్టుకొస్తున్న పూరి

‘వీరసింహారెడ్డి’ విలన్‌ను పట్టుకొస్తున్న పూరి

Published on Apr 28, 2025 6:21 PM IST

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇటీవల ఈ చిత్రాన్ని అఫీషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చిత్ర క్యాస్టింగ్‌ను ఫైనల్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇప్పటికే సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు పూరి అండ్ టీమ్ అనౌన్స్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమాలో దునియా విజయ్ కూడా నటిస్తున్నట్లు పూరి అనౌన్స్ చేశాడు. దునియా విజయ్ గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో విలన్‌గా నటించాడు. ఇప్పుడు పూరి సినిమాలో దునియా కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్స్ట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు