“RRR” 80 కోట్ల అంశంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

“RRR” 80 కోట్ల అంశంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

Published on Mar 21, 2023 2:30 PM IST

గ్లోబల్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” గ్లోబల్ వైడ్ గా అనుకున్న రీచ్ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్ లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. మరి ఈ అవార్డ్స్ లో నాటు నాటు కి గాను బెస్ట్ సాంగ్ అవార్డు రావడం ఎంత వైరల్ అయ్యిందో దానికన్నా ముందు అయితే ఈ అవార్డు కోసం టీం అంతా అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.

మరి దీనికి గాను ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టారు అని టాక్ రావడం దీనిపై అనేకమంది మేధావులు పలు సంచలన కామెంట్స్ కూడా చేయడం వైరల్ గా మారింది. అయితే ఈ కామెంట్స్ పై ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలా కామెంట్స్ చేస్తున్న వారికి నా బ్యాంకు స్టేట్మెంట్ గాని ఇతర వివరాలు చూసారా? ఆ వార్తలన్నీ బలంగా తాను ఖండిస్తున్నానని వాటిపై చెక్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు