లైగర్: ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ!

లైగర్: ఈడీ ముందు హాజరైన విజయ్ దేవరకొండ!

Published on Nov 30, 2022 12:56 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ ఉప శీర్షిక. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు హాజరు అయ్యారు.

ఈ చిత్రం లావాదేవీల విషయం లో విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా వ్యవహరించిన ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ లను ఈడీ విచారించడం జరిగింది. లైగర్ సినిమా నిర్మాణం కోసం దుబాయ్ కు డబ్బులు పంపి, అక్కడి నుండి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక ఓ ప్రముఖ రాజకీయ నేత హస్తం కూడా ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై త్వరలో ఒక క్లారిటీ రానుంది. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, మైక్ టైసన్, రమ్య కృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు