లేటెస్ట్ : చిరు, బాలయ్య సినిమాలతో కొలాబరేట్ అయిన ప్రముఖ బ్రాండ్

లేటెస్ట్ : చిరు, బాలయ్య సినిమాలతో కొలాబరేట్ అయిన ప్రముఖ బ్రాండ్

Published on Dec 24, 2022 1:00 AM IST


టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ప్రస్తుతం యువ హీరోలకు ధీటుగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇక లేటెస్ట్ గా వీరిద్దరూ చేస్తున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రాబోయే 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నిర్మితం అయిన ఈ రెండు సినిమాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అటు మెగా, నందమూరి ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా యావత్ ఆడియన్స్ అందరిలో కూడా ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మ్యాటర్ ఏమిటంటే, కొన్నేళ్లుగా ప్రజలకు మంచి క్వాలిటీ మినరల్ వాటర్ అందిస్తూ బాగా పేరుతో కొనసాగుతున్న సంస్థ బిస్లరీ వారు చిరు, బాలయ్య నటిస్తున్న ఈ రెండు సినిమాలతో తాజాగా కొలాబరేట్ అయ్యారు. లిమిటెడ్ ఎడిషన్ లో ఈ రెండు సినిమాల లేబుల్స్ ముద్రించిన బిస్లరి వాటర్ బాటిల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో లభ్యం కానున్నాయి. కాగా ఈ కొలాబరేషన్ వలన అటు ఈ రెండు సినిమాలకు ఇటు బిస్లరి సంస్థకు మరింతగా పబ్లిసిటీ దక్కడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు