ఊరిస్తూ, ఉడికిస్తున్న ‘రంగస్థలం’ టీమ్ !

ఊరిస్తూ, ఉడికిస్తున్న ‘రంగస్థలం’ టీమ్ !

Published on Jan 24, 2018 7:00 AM IST

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రంగస్థలం’ చిత్ర టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వింటేజ్ లుక్ లో ఉన్న చరణ్ ను చూడాలని తహతహలాడిపోతున్నారు. దానికి తోడు చిత్ర టీమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోస్టర్లతో టీజర్ ఏ స్థాయిలో ఉంటుందో హింట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తూ, ఉడికిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఇంకాస్త ఆతురత ఇంకాస్త ఎక్కువైపోయింది.

ఇంతటి అంచనాలు కలిగిన ఈ టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు విడుదలకానుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటిస్తుండగా ఆది పినిశెట్టి, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్న ఈ చిత్రం వసూళ్ళ పరంగా కూడా భారీ సంఖ్యల్ని నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు