జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాతిరత్నాలు సినిమా తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు. రీసెంట్గా బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్లో చిందేసిన ఫరియా ప్రస్తుతం రవితేజతో రావణాసుర అనే చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఫరియాకు కోలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బిచ్చగాడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించనున్నట్లు తెలుస్తుంది. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫరియా ఓ పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుందట. మరీ ఇందులో ఎంత మేరకు నిజముందనేది తెలియాలంటే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.