అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on Oct 2, 2022 8:11 PM IST

అల్లరి నరేష్ హీరోగా ఏ. ఆర్.మోహన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది. నాంది చిత్రం సూపర్ హిట్ తర్వాత నరేష్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ పై చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. లచ్చిమి అనే సాంగ్ ను అక్టోబర్ 4 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం లో ఆనంది, అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 11 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు