గేమ్ ఛేంజర్‌ కొత్త షెడ్యూల్ అక్కడే

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. తాజా అప్ డేట్ ప్రకారం, గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ రేపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ప్రారంభం కానుంది. సినిమాలోని కీలక తారాగణం మొత్తం ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతారట. ఈ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకం అని, ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ సీనియర్ పాత్ర పై ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

Exit mobile version