ఈ నెల 24న ‘థీమ్‌’ తో రాబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. కాగా తాజాగా ఈ చిత్రం(ఆఆఆ) థీమ్‌ని దర్శకుడు శ్రీనువైట్ల పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ కొడతారో లేదో చూడాలి.

Exit mobile version