టాలీవుడ్ హీరో విష్ణు మంచు దర్శకుడు సూర్యతో జిన్నా అనే యాక్షన్ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపాడు. ఇది విష్ణు యొక్క మొదటి పాన్ ఇండియా చిత్రం. మరియు అక్టోబర్ 5, 2022 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు, ఈ సినిమా టీజర్ పై చిత్ర యూనిట్ ప్రకటన చేయడం జరిగింది.
ఈ చిత్రం టీజర్ ను ఆగస్ట్ 25, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టీజర్ను తెలుగు, హిందీ మరియు మలయాళంలో విడుదల చేయనున్నట్లు వారు ధృవీకరించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ కథానాయికలు గా నటిస్తున్నారు. AVA ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.