“నేను c/o నువ్వు” ప్రీమియర్ షో కి మంచి రెస్పాన్స్!

“నేను c/o నువ్వు” ప్రీమియర్ షో కి మంచి రెస్పాన్స్!

Published on Sep 29, 2022 8:52 AM IST

ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్, సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులు గా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నేను c/o నువ్వు. ఈ చిత్రానికి అత్తావలి, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు. ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ ప్రముఖులకు, పాత్రికేయులకు మరియు ఫెమస్ యూట్యూబర్స్ కు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది.

షో అనంతరం మీడియా సమావేశంలో నిర్మాతలు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ, సినిమా చాలా బాగుంది. మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం మనం చూస్తునే ఉన్నాము. కాబట్టి ఇలాంటి పరువు హత్యల సినిమాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి. ఈ సినిమాల వలన ప్రేక్షకులలో ఇంకా అవగాహన పెరుగుతుంది. చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడని చూసిన వారందరూ ప్రశంశలతో ముంచెత్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు