మూడోసారి కూడా సాలిడ్ టీఆర్పీ ను రాబట్టిన ఐకాన్ స్టార్ “పుష్ప”

మూడోసారి కూడా సాలిడ్ టీఆర్పీ ను రాబట్టిన ఐకాన్ స్టార్ “పుష్ప”

Published on Jul 1, 2022 12:00 AM IST

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మూడోసారి టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడం జరిగింది. అయితే మూడోసారి ఈ చిత్రానికి 9.59 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.

మొదటి సారి 22.54, రెండోసారి 12.87 టీఆర్పీ లను నమోదు చేయగా, మూడోసారి సైతం మంచి రేటింగ్ ను రాబట్టింది. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సునీల్, అజయ్, అనసూయ, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెండో భాగం పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు