గోపీచంద్ చేతుల మీదుగా “కోటేశ్వర రావు గారి కొడుకులు” టీజర్ లాంచ్..!

గోపీచంద్ చేతుల మీదుగా “కోటేశ్వర రావు గారి కొడుకులు” టీజర్ లాంచ్..!

Published on Dec 11, 2021 2:09 AM IST


అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం “కోటేశ్వరరావు గారి కొడుకులు”. (మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో ప్రియాంక డి, చందన హీరోయిన్లుగా నటిస్తుండగా, వశిష్ట్ నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌‌ని మ్యాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు గోపీచంద్. ఈ మేరకు యూనిట్ సభ్యులను అభినందించారు.

టీజర్ విషయానికొస్తే 2 నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం ఖచ్చితంగా మనీ అయ్యి ఉంటుందని, అనే రియలిస్టిక్ డైలాగ్‌తో ప్రారంభమై ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మనీ కెన్ డు ఎనీథింగ్.. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అంటూ మోడ్రన్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్‌గా మారింది.

మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇదని, తండ్రీ కొడుకుల మధ్య మనీ మ్యాటర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకునే తండ్రి కల నెరవేరిందా? అదేవిధంగా తండ్రిని కోటీశ్వరుడు చేయాలనుకునే ఆ కొడుకుల ప్రయత్నం ఫలించిందా? అనే డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు