అయోధ్య వెళ్లిన “హనుమాన్” టీమ్… అసలు కారణం ఇదే!

అయోధ్య వెళ్లిన “హనుమాన్” టీమ్… అసలు కారణం ఇదే!

Published on Nov 29, 2022 11:08 PM IST


టాలీవుడ్ యంగ్ యాక్టర్ తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కే.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్ కి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, హనుమాన్ టీమ్ అయోధ్య కి చేరింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జ లు శ్రీ రాముడి ఆశీస్సులు తీసుకొనేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హారి గౌర, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు