రామ్ చరణ్ గురించి సీక్రెట్స్ చెప్పిన ఉపాసన !

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో మెగాస్టార్ పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన ఖచ్చితంగా ఉంటారు. ఉపాసన తన భర్త గురించి, చెర్రీ వ్యక్తిగత విషయాలు, ఆయన సినిమాల అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. కాగా తాజాగా ఉపాసన, ఈ రోజు రామ్ చరణ్ చేసిన పన గురించి చెప్తూ.. సరదాగా తన ట్వీటర్ అకౌంటులో పోస్ట్ పెట్టారు.

ఉపాసన చెర్రీ గురించి ట్వీట్‌ చేస్తూ.. ‘మంచి రుచికరమైన వంటలు ‘బలవంతంగా నైనా తినిపిస్తాడు అని లవ్ సింబల్ పెట్టారు. ఆ తర్వాత జిమ్‌కు తీసుకెళ్లి తిన్నది అరిగిందాకా చంపుతాడు.. అని సాడ్ సింబల్ పెట్టారు. ‘మిస్టర్‌ సితో ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది’ అని ఉపాసన పోస్ట్ చేస్తూ.. రెండు ఫోటోలను కూడా జత చేశారు.

ప్రస్తుతం, రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version