మెగా హీరో సాయిధరమ్ తేజ్ మొన్న శుక్రవారం నాడు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన వెంటనే తొలుత సాయితేజ్ను మాదాపూర్లోని మెడికోర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో సాయిధరమ్ తేజ్కు కొద్దిసేపు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరుణంలో సాయితేజ్ని స్పృహలోకి తెచ్చేందుకు ఓ డాక్టర్ ప్రయతిస్తూ ‘కళ్లు తెరవండి.. ఇటు చూడండి అంటూ భుజం తట్టి లేపుతున్న వీడియో బయటకు వచ్చింది.
అయితే ఈ వీడియోపై యంగ్ హీరో నిఖిల్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఓ వ్యక్తి ఆస్పత్రి ఐసీయూలో ఉన్నప్పుడైనా ఆ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వండని కోరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయితేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు సాయితేజ్కి కాలర్ బోన్ శస్త్రచికిత్స జరగ్గా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Why are Cameras being allowed into an ICU ? It’s sad to see these videos of @IamSaiDharamTej getting treated. Please Respect A persons Privacy???????? At least inside a Hospital ICU…
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2021