హీరో సుధీర్ బాబు హీరోగా నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో చేసిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో సుధీర్బాబు తెలుగు తెరకు ప్రొడ్యూసర్ కూడా పరిచయం అయ్యారు. అయితే అంతకు ముందు ‘సమ్మోహనం’ సినిమాతో కూడా భారీ హిట్ కొట్టాడు.
కాగా ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమా పై దృష్టిసారించాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ‘బ్యాక్ టు ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ (బ్యాడ్మింటన్). పెద్దలు చెప్పినట్లుగా తొలిప్రేమ ఎప్పటికీ బతికే ఉంటుంది. నా తొలిప్రేమ బ్యాడ్మింటన్.ప్రస్తుతం ప్రిపరేషన్ ఫర్ పుల్లెల గోపీచంద్’ అంటూ పోస్ట్ చేశాడు. సుధీర్బాబు సినిమాల్లోకి రాకముందు బాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం