హిందీ ‘అర్జున్ రెడ్డి’ సరసన ‘మహేష్ బాబు హీరోయిన్’ !


‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా రిలీజ్ అయి, సంచలనాత్మక విజయాన్ని అందుకొని.. ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లోకి కూడా గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా, తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం.. హిందీ అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా మహేష్ బాబు హీరోయిన్ నటించనుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించిందని.. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

అయితే కియారా అడ్వాణీ ఈ బోల్డ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే ఆమెను తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు.

Exit mobile version