లేటెస్ట్ : ‘కాంతారా’ పై ప్రసంశలు జల్లు కురిపించిన స్టార్ హీరోయిన్

లేటెస్ట్ : ‘కాంతారా’ పై ప్రసంశలు జల్లు కురిపించిన స్టార్ హీరోయిన్

Published on Nov 26, 2022 10:05 PM IST


హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన మూవీ కాంతారా. కన్నడ లో రూపొందిన ఈ మూవీ అక్కడ పెద్ద విజయం అందుకున్న అనంతరం తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. డివైన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల పైచిలుకు కలెక్షన్ సొంతం చేసుకుంది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రమోద్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు చేసారు.

అయితే ఈ మూవీ పై ఇప్పటికే ఎందరో ప్రేక్షకాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుండి కూడా ప్రసంశలు దక్కగా నేడు కొద్దిసేపటి క్రితం స్టార్ హీరోయిన్ త్రిష ఈ మూవీ పై తన ఇన్స్టాగ్రమ్ ద్వారా పొగడ్తలు కురిపించారు. కాంతరా చూశానని, తనకు ఎంతో నచ్చిందని పోస్ట్ పెట్టిన త్రిష, మూవీ హీరో కం డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కి హీరోయిన్ సప్తమి గౌడ కు అలానే నటుడు కిషోర్ కుమార్ సహా యూనిట్ మొత్తానికి తన తరపున కాంతారా బిగ్ సక్సెస్ పై ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. కాగా త్రిష పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు