NTR30 లాంఛ్ ఈవెంట్ లో హైలైట్స్ ఇవే!

NTR30 లాంఛ్ ఈవెంట్ లో హైలైట్స్ ఇవే!

Published on Mar 23, 2023 7:59 PM IST

ఎన్టీఆర్ హీరోగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ NTR30. గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళితో పాటు ప్ర‌శాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు, బి.వి.ఎస్‌.ఎన్. ప్ర‌సాద్, ఏషియ‌న్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్‌, భ‌ర‌త్ చౌద‌రి, జాన్వీ క‌పూర్‌, ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌గారితో సెకండ్‌ టైమ్‌ సినిమా చేస్తున్నాను. జనతాగ్యారేజ్‌ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే భయం వారికి. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్‌ రైడ్‌. ఈ కథకు ప్రాణం పోయాలంటే నేనెంత రాయాలో, అనిరుద్‌ అంత చేయాలి. ఫైర్‌తో రాశారు సార్‌ ఈ కథని అని అనిరుద్‌ అన్నారు. సాబు సార్‌ తప్ప, నా ఊహకి రూపం ఇవ్వడానికి ఇంకెవరూ లేరు. జాన్వీ హీరోయిన్‌గా చేస్తున్నారు. సెట్స్ లో ఫన్‌ ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ మాట్లాడుతూ, “శివగారిని ఏడాది క్రితం కలిశాను. అప్పటి నుంచి వండర్‌ఫుల్‌ టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాం. ఆయన విజన్‌లో నేను చిన్న భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. హ్యూజ్‌ విజన్‌ ఆయనది. ఈ సినిమాలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లెజండరీస్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మోషన్‌ పోస్టర్‌ కి వచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. తారక్‌కి ధన్యవాదాలు. నేను తిరిగి వస్తున్నా” అని అన్నారు.

ఎమోషనల్‌ స్టోరీని శివగారు ఎలా ముందుకు తీసుకెళ్తారో నాకు తెలుసు. శివగారి విజన్‌ని మేం అందరం ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాను అని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అన్నారు. ఇంత మంది లెజండరీస్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. టెక్నికల్‌గా చాలెంజింగ్‌ సినిమా. సీ బ్యాక్‌గ్రౌండ్‌లో చేస్తున్నాం. ల్యాండ్‌లో రెండు షాట్స్ చేసేది, సముద్రంలో చేయడానికి అరపూట పడుతుంది. టెక్నికల్‌గా బ్రిలియంట్‌ సినిమా అవుతుంది. శివగారి విజన్‌ని స్క్రీన్‌ మీదకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం అని సినిమాటోగ్రపీ రత్నవేలు అన్నారు.

నాకు గ్రేట్‌ చాలెంజ్‌ ఇచ్చారు. నాకు చాలెంజ్‌లంటే ఇష్టం. ఏడాది గా ఈ సినిమాకు పనిచేస్తున్నాం అని ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అన్నారు. నేను 25 ఏళ్లుగా విజువల్‌ ఎఫెక్ట్స్ చేశాం. నేను చేసిన వాటిలో ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంలోని బెస్ట్ స్టూడియోలను మేం లాక్‌ చేస్తున్నాం. నా మీద నమ్మకం ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కూడా ప్రూవ్‌ చేసుకుంటాను అని వి.ఎఫ్.ఎక్స్ అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు