టాలీవుడ్ కోసం బాలీవుడ్ ను వదులుకున్నా – ‘కృతి శెట్టి’

టాలీవుడ్ కోసం బాలీవుడ్ ను వదులుకున్నా – ‘కృతి శెట్టి’

Published on Aug 9, 2022 12:30 AM IST

‘కృతి శెట్టి’ ఉప్పెన సినిమాలో ‘నీ కన్ను నీలి సముద్రం… అనే ఒక లిరికల్ వీడియో సాంగ్ తో ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది. పైగా ఈ సెన్సేషన్ బ్యూటీ మొదటి సినిమా ఉప్పెన సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని, చైతులతో చేసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి. దాంతో ‘కృతి శెట్టి’ కి ఇక తిరుగులేకుండా పోయింది. ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘కృతి శెట్టి’ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘కృతి శెట్టి’ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా ‘కృతి శెట్టి’ తన బాలీవుడ్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని ‘కృతి శెట్టి’ చెప్పింది. అయితే, తనకు టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం తనకు లేదనుకున్నాను అని ‘కృతి శెట్టి’ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన హిందీ ఆఫర్ ను ఈ బ్యూటీ తిరస్కరించిందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు