తన షో కి బాలక్రిష్ణని పిలుస్తానన్న చిరంజీవి !

తన షో కి బాలక్రిష్ణని పిలుస్తానన్న చిరంజీవి !

Published on Feb 12, 2017 2:24 PM IST


మెగా అభిమానులు, బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 4 రేపటి నుండి మొదలుకానుంది. స్టార్ మా ఛానెల్ లో రాత్రి 9: 30 నుండి 10:30 వరకు ప్రసారమయ్యే ఈ షో వారంలో సోమ, మంగళ, బుధ మరియు గురు వారాల్లో ప్రదర్శితమవుతుంది. ఇదివరకు నాగార్జున అక్కినేని చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో బాగా పాపులర్ అవడం, చిరంజీవి చేస్తుండటంతో ఈ సిజన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇకపోతే మొత్తం 60 ఎపిసోడ్లు ఉన్న షోలో సెలబ్రిటీ ఎపిసోడ్లు కూడా ఉండనున్నాయి. ఈ ఎపిసోడ్లకు నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలు హాజరవుతున్నారు. ప్రస్తుతం వాటికి సంబందించి షూటింగ్ జరుగుతోంది కూడా. ఇక ఈ రోజు జరిగిన స్టార్ మా ఛానెల్ లోగో ఆవిష్కరణలో బాలకృష్ణ కూడా ఈ షోకి వస్తారా అనే ప్రశ్న రాగానే మెగాస్టార్ ‘నేను, బాలకృష్ణ మంచి స్నేహితులం. ఆయన పుట్టినరోజుకి ఇదే వేదికపై ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. నేను తప్పకుండా ఆయన్ని షోకి పిలుస్తాను. ఆయన కూడా వస్తారే అనుకుంటున్నాను’ అని సమాధానం చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు