యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 9న ఈ సినిమా విడుదల కానుందని దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.
మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమాలో నటిస్తున్నాడు.