పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాత్రలో మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోందట.
ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ నవంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.